ఇజ్రాయెల్ దేశ ఆవిర్భావం



యాకోబుకు దేవుడు ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. ఈ ఇశ్రాయేలు (యాకోబు) నుంచి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు 12 గోత్రములుగా ఉండేవారు (ఆదికాండము 49:28)

ఈ 12 గోత్రాల ప్రజలు ఒకే రాజ్యము (దేశము) గా ఒకే రాజు కింద కనాను దేశములో ఉండేవారు. అయితే క్రీ.పూ. 10 వ శతాబ్దములో సోలోమాను చనిపొయిన తరువాత ఈ 12 గోత్రముల ప్రజలు రెండు రాజ్యాలుగా చీలిపోయారు. 

ఉత్తరాన ఉన్న 10 గోత్రములు కలిపి “ఇశ్రాయేలు రాజ్యముగా”, దక్షిణాన ఉన్న 2 గోత్రములు (యూదా, బెన్యామీను అర్థ గోత్రము) “యూదా రాజ్యముగా” ఏర్పడ్డారు.
(ఈ ఇశ్రాయేలీయులు రెండు రాజ్యాలుగా ఎప్పుడు విడిపోయారు అనేది 1 రాజులు 11, 12 అధ్యాయాలలో మనము చదవవచ్చు.)

ఈ విధముగా దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు రెండు రాజ్యాలుగా విడిపోయిన తరువాత “ఇశ్రాయేలు రాజ్యాన్ని” 19 మంది రాజులు క్రీ.పూ. 10వ శతాబ్దము నుండి క్రీ.పూ.700 వరకు పరిపాలించారు. తరువాత దేవుడు వారు చేసిన పాపాలను బట్టి వారిని చెరకు అప్పగిస్తాడు. అలా క్రీ.పూ.7వ శతాబ్దములో ఇశ్రాయేలు 10 గోత్రాల వారు చెల్లా చెదురు అవుతారు, అన్యులలో కలిసిపోతారు, అనేక దేశాలకు వలసగా వెళ్తారు. అలా క్రీ.పూ.7వ శతాబ్దము నుండి అన్య రాజుల క్రింద పరిపాలించాబడుతూ ఉండేవారు. (2 రాజులు 17వ అధ్యాయము)

ఇక మిగిలిన యూదా రాజ్యంలో ఉన్న 2 గోత్రముల వారిని 20 మంది రాజులు క్రీ.పూ.10వ శతాబ్దము నుండి క్రీ.పూ. 586 వరకు పరిపాలించారు. అయితే వీరు చేసిన పాపములను బట్టి దేవుడు వీరిని బబులోను రాజుకు అప్పగిస్తాడు. అలా యూదులు 70 సంవత్సరాలు బబులోనుకు చెరగా కొనిపోబడతారు. తరువాత మరలా యూదులు తిరిగి యేరుషలేముకు వచ్చినప్పటికీ కొంతమంది యూదులు బబులోనులోనే ఉండిపోయారు. 

యూదులు యేరుషలేములో తమ సొంత దేశంలో ఉన్నప్పటికీ వారు అన్య రాజుల క్రింద పరిపాలించబడుతూ ఉండేవారు. ఎప్పుడూ ఎదో ఒక రాజు యేరుషలేమును ఆక్రమించుకొని వారిని చిత్ర హింసలకు గురిచేసేవారు. అలా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దము నుండి యూదులకు రాజు లేడు, స్వాతంత్ర్యం లేదు. అన్య రాజుల హింసలకు తట్టుకోలేక యూదులు యెరూషలేము నుండి అనేక ఇతర దేశాలకు వలస వెళ్ళేవారు. అలా వలస వెళ్ళిన యూదులను వివిధ దేశాలలో చిత్ర హింసలకు గురి చేసేవారు. 20 వ శతాబ్దములో జర్మనీ దేశములో హిట్లర్ యూదులను రోజుకు 20 వేల మంది చొప్పున 60 లక్షల మంది యూదులను గ్యాస్ చాంబర్స్ లో బందించి, గ్యాస్ వదిలిపెట్టి దారుణముగా చంపించాడు. ప్రపంచములో ఉన్న అన్ని జాతులకంటే యూదులు బాగా తెలివి కలిగిన వారని వారిని నిర్మూలము చేస్తే ఆర్యులే ప్రపంచములో అందరికంటే ఎక్కువ తెలివి కలిగిన వారిగా ఉంటారని హిట్లర్ యూదులను నిర్మూలము చెయ్యడానికి పూనుకున్నాడు. యూదు జాతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త Albert Einstein ను కూడా చంపడానికి ప్రయత్నించాడు హిట్లర్, అప్పుడు Albert Einstein అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. అలాంటి పరిస్థితిలో యూదులు ఉండేవారు. 

ఇశ్రాయేలు 12 గోత్రముల వారు తమ రాజ్యాన్ని, సొంత దేశాన్ని పోగొట్టుకొని ప్రపంచ వ్యాప్తముగా చెల్లా చెదురయ్యి ఎందుకు ఇన్ని చిత్ర హింసలు అనుభవించారు? అందుకు కారణం వారు చేసినా పాపాలే. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞని మీరి అన్య దేవతల తట్టు తిరగడం వారు చేసిన ఘోర పాపం. (2 రాజులు 17:7-23)

అయితే రెండు రాజ్యాలుగా విడిపోయిన 12 గోత్రాలను, ప్రపంచ వ్యాప్తముగా చెల్లా చెదురయిపోయిన ఆ జనాన్ని సమకూర్చి ఒకే రాజ్యముగా చేస్తానని దేవుడు క్రీ.పూ. 6,7,8 వ శతాబ్దాలలో ప్రవక్తల ద్వారా ముందే వ్రాయించాడు. (యెహేజ్కేలు 37:15-23; 36:24; 11:17-19; వచనాలు, యెషయా 11:11-13; 43:5-7 వచనములు, యిర్మియా 16:14,15 వచనాలు చూడండి.)

యెహేజ్కేలు 37:21-22: ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను.

దేవుడు బైబిలులో చెప్పినట్లు గానే తన ప్రవచనాన్ని క్రీ.శ. 1948 మే 14న నెరవేర్చాడు, హల్లెలుయా. 

1948 మే 14న ఇశ్రాయేలీయులకు స్వాతంత్ర్యం వచ్చింది, వారి స్వంత దేశం వారికి తిరిగి వచ్చింది.

కొంతమంది పోరాట యోధులు ప్రపంచమంతా చెదిరి ఉన్న యూదులందరూ తిరిగి తమ మాతృభూమికి రావాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు దేశం బ్రిటిషు వారి ఆధీనములో ఉంది. వారందరి పిలుపు మేరకు ప్రపంచమంతటా ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి 1948 మే నెలలో ఇశ్రాయేలు దేశం చేరుకున్నారు. 

1948 మే 14వ తేదీన ఇశ్రాయేలు దేశంలోని “Tel Aviv”నగరంలోని మ్యూజియంకు ఐక్య రాజ్య సమితి సభ్యులంతా చేరుకొన్నారు. కాసేపు తరువాత David Ben-Gurion ఇశ్రాయేలు దేశం ఆవిర్భవించిందని ప్రకటన చదివాడు. ఇశ్రాయేలు జాతీయ గీతం ఆలపించబడినది. వెంటనే అమెరికా అద్యక్షుడు Harry S. Truman ఇశ్రాయేలు దేశాన్ని గుర్తించినట్లు ప్రకటించాడు. ఎందుకనగా ఐక్య రాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ప్రకారం ఇశ్రాయేలు దేశం ఏర్పడినది. 

దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనం నెరవేరినది. 

ఇప్పుడు ఇశ్రాయేలు దేశం భౌతికముగా తిరిగి జన్మించినది. ఈరోజు వారికి ఒక జాతీయ పతాకం, రాజ్యాంగ చట్టం, పార్లమెంటు ఉంది. ప్రధాన మంత్రి, మంత్రిమండలి ఉంది. రక్షణ దళం, బలమైన సైనిక వ్యవస్థ ఉంది. మహా దేవుని పట్టణమైన “యేరుషలేము” ముఖ్య పట్టణముగా వుంది. 

ఈ సంఘటన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి రానున్నాడనే దానికి ముంగురుతు, కనుక క్రైస్తవులమైన మనం నిరీక్షిస్తున్న క్రీస్తు రాకడ అతి త్వరలో సంభవింపబోతున్నదని గ్రహించాలి. దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన రక్షణను చివరి వరకు కాపాడుకుంటూ అనేకులను రక్షణలోకి నడిపిద్దాము. 
అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక, ఆమెన్. 

ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను (కీర్తనలు 102:16)

భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.
(యెషయా 43:5-7)

మీ
సహోదరుడు
Brother SURESH
9581881880

No comments:

Post a Comment