➤ సిలువలో స్పృహ కోల్పోయాడు(Swoon Theory):
యేసుక్రీస్తు సిలువలో మరణించలేదు కేవలము స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన అతనిని సమాది చేశారు అతడు తరువాత స్పృహలోకి వచ్చి కోలుకొని రాయిని తీసుకుని బయటికివచ్చి తన్నుతాను సజీవునిగా కనబరచుకున్నాడు. దీనిని నమ్మిన శిష్యులు ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేశారు. అన్నది కొందరి వాదన.
అహమదీయ అనే ముస్లీము తెగ విశ్వాసము ప్రకారము- యేసుక్రీస్తు సిలువపై స్పృహ కోల్పోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి గలిలయకు వెళ్ళి అక్కడ నుండి ఇరాక్ కు వెళ్ళి అక్కడ నుండి అఫ్ఘనిస్తాన్ కు ఆ తరువాత కాశ్మీర్(ఇండియా)కు వెళ్ళి అక్కడ 120సంవత్సరములు జీవించి మరణించాడు. శ్రీనగర్ లో అతని సమాది ఉంది. ఇది అహమదీయ వారి వాదన, అయితే ఈ వాధనను సాంప్రదాయ ముస్లిములు వ్యతిరేకిస్తున్నారు.
ఇక్కడ యేసుక్రీస్తు చనిపోలేదు అని అంటే పునరుత్థానమయ్యాడు అన్న ప్రశ్నేలేదు. అప్పుడు క్రైస్తవ్యమే పుర్తిగా తప్పు అవుతుంది అన్నది వారి యొక్క ఉద్దేశ్యం. దీనికి వారికున్న ఆధారం ఏమిటీ అని అంటే, యేసుక్రీస్తు సిలువమీద తక్కువ సమయం ఉండడమే.
అహమదీయ అనే ముస్లీము తెగ విశ్వాసము ప్రకారము- యేసుక్రీస్తు సిలువపై స్పృహ కోల్పోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి గలిలయకు వెళ్ళి అక్కడ నుండి ఇరాక్ కు వెళ్ళి అక్కడ నుండి అఫ్ఘనిస్తాన్ కు ఆ తరువాత కాశ్మీర్(ఇండియా)కు వెళ్ళి అక్కడ 120సంవత్సరములు జీవించి మరణించాడు. శ్రీనగర్ లో అతని సమాది ఉంది. ఇది అహమదీయ వారి వాదన, అయితే ఈ వాధనను సాంప్రదాయ ముస్లిములు వ్యతిరేకిస్తున్నారు.
ఇక్కడ యేసుక్రీస్తు చనిపోలేదు అని అంటే పునరుత్థానమయ్యాడు అన్న ప్రశ్నేలేదు. అప్పుడు క్రైస్తవ్యమే పుర్తిగా తప్పు అవుతుంది అన్నది వారి యొక్క ఉద్దేశ్యం. దీనికి వారికున్న ఆధారం ఏమిటీ అని అంటే, యేసుక్రీస్తు సిలువమీద తక్కువ సమయం ఉండడమే.
మొదటిగా ఇది వారియొక్క కల్పిత సిద్ధాంతము మాత్రమేగాని నిరూపించబడిన విషయం కాదు. దీనికి ఏ ఆదారము లేదు! అని గమనించాలి
దీనివల్ల సమస్య ఏమిటంటే యూదులు, రోమా ప్రభుత్వము తెలివితక్కువగా మోసపోయారు; చనిపోని వ్యక్తిని చనిపోయినట్లు భావించారు, యేసు శిష్యులు ఆయన తిరిగి లేచాడని నమ్మడం బుద్దిహీనత మరియు యేసుక్రీస్తు కావాలని ఒక అబద్దాన్ని ప్రచారం చేశాడని అర్థం.
దీనిని అర్థం చేసుకోవడానికి మనము సిలువ వేయడం(Crucifixion గురించి తెలుసుకోవాలి. సిలువ మరణం చాలా మెల్లగా(slowly) క్రూరంగా(Cruelly) ఒకరిని మరణింపజేయడం. నిజానికి సిలువమరణం, కాళ్ళల్లో, చేతుల్లో మేకులు కొట్టడం వల్ల మరణింపజేయడం కాదుగాని, శ్వాస తీసుకోలేక పోవడం వల్ల మరణింపజేసే విధానము. దీనినే వైద్య పరిభాషలో ‘Asphyxial death' అంటారు.
సిలువ వేయబడిన మనిషి బరువు మొత్తం, నడుమును కట్టియుంచనందున అతని కాళ్ళ మీద మరియు చేతులమీదే పడుతుంది. సిలువలో వ్రేలాడిన మనిషి తన రెండు కాళ్ళ మీద తన బరువును మోపి చేతులపై భారమువేసి పైకి లేస్తేనేగాని అతడు శ్వాస తీసుకోలేడు, కాబట్టి తను శ్వాస తీసుకోవాలంటే మాటి మాటికి తన కాళ్ళ మీద తన బరువును మోపి చేతులపై భారమువేసి పైకి లేవాలి, అయితే చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టడంవల్ల తను శ్వాస తీసుకోవడానికి లేచిన ప్రతీసారి కాళ్ళల్లో చేతుల్లో విపరీతమైన బాధ అనుభవించాల్సివస్తుంది. రానురాను నొప్పి భరించే శక్తిలేక పైకిలేవడం వదిలివేసి శ్వాసతీసుకోలేక మరణించడం అన్నమాట.
యేసుక్రీస్తుకు చెరో వైపున ఉన్న దొంగల కాళ్ళు విరగొట్టారు దీనికి కారణం: యూదులు, సబ్బాతు రోజు ఆరంభం కాకముందే శవాలను సిలువ మీది నుండి దించాలి. కాబట్టి సిలువవేయబడినవారు త్వరగా చనిపోవడానికి వారి కాళ్ళను విరగ్గొట్టారు. ఎందుకంటే వారు ఇక శ్వాస తీసుకోలేక మరణిస్తారు. కాని యేసుక్రీస్తు అప్పటికే చనిపోవడం చూసి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. రోమా సైనికులు చనిపోయాడని నిర్ధారించుకునేంతవరకు శవాన్ని అప్పగించరు. అందుకే యేసును వారు ప్రక్కలో బళ్ళెంతో పొడిచి చూసారు (యోహాను 19:34,35). వెంటనే రక్తము,నీళ్ళూ రావడము నమోదు చేయబడింది. గుండె చుట్టూ పెరికార్డియం(Pericardium) అనే పొర ఉంటుంది దీనిలో సీరస్(serous) అనే ద్రవము(నీరు) ఉంటుంది. బళ్ళెంతో పొడిచినప్పుడు ఈ నీరు, గుండె కుడి ప్రక్కనుండి రక్తం బయటికి వచ్చాయి. ఒకవేళ యేసుక్రీస్తు బ్రతికి ఉన్నా ఈ బక్ళెంపోటుకైనా మరణించాలి.
స్పృహ కోల్పోయిన యేసును సమాధి చేసారు, స్పృహలోకి వచ్చి, కోలుకొని, రాయిని తీసుకుని బయటికివచ్చి, తన్నుతాను సజీవునిగా కనబరచుకున్నాడు” అని చెప్పే వీరిమాట నిజం కావాలంటే యేసు మూడు అడ్డంకులు అధిగమించి రావాలి,
1) ఆయన శరీరానికి నారబట్ట చుట్టి పూసిన సుగంధ ద్రవ్యాలు ఎండిపోయి గట్టిగా ఆయనను బంధించి ఉంచుతాయి కాబట్టి వాటిని ఎలా తొలగించుకున్నాడు అన్నది ప్రశ్న! ఎందుకంటే ఆయనకు పూసిన సుగంధ ద్రవ్యములు(గోపరసము లేదా బోళము +కలబంద) 150 సెర్ల ఎత్తు(దాదాపు 45kg)(యోహాను 19:39), అతుక్కునే జిగురు వంటి పదార్థం ఇందులో ఉంటుంది. ఆయన దేహానికి వాటిని పూసి నారబట్టతో అతనిని కాళ్ళ నుండి పైకి అంతా చుట్టుతూ, చేతులు శరీరానికి చక్కగా ఆనించి వాటిని కూడా చుట్టి, ముఖానికి తలకు ఒక వేరే నారబట్టను గట్టిగా చుట్టి కట్టి సమాధిలో ఉంచారు. అసలు తలకు మొత్తం వస్త్రం చుట్టినప్పుడైనా ఆయన మరణించాలి, సరే దానిని అదిగమించిన మూడు దినములకు ఆ నారబట్ట శరీరానికి గట్టిగా అతుక్కుని ఉంటుంది. సుహ వచ్చిన యేసు వీటిని ఎలా విడిపించుకున్నాడు! అది సాధ్యమయ్యే పనేనా!
2) సమాది ముందు ఉంచిన పెద్దరాయి: ఆ రాయి యెంతో పెద్దది అని మర్కు 16:4లో ఉంది. దీని బరువు తక్కువలో తక్కువ(minimum) 1300కిలోల నుండి 1800ల కిలోల వరకు ఉంటుంది అని ఒక అంచనా. సమాధికి ముందే యేసుక్రీస్తును 39 కొరడా దెబ్బలు కొట్టారు, వళ్ళంతా గాయాలు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బళ్ళెంపోటు, శరీరంలో నుండి రక్తం అంతా పోయింది, అంతేగాక సమాదిలో మూడు రోజులుగా ఆహారం లేదు. బ్రతికి ఉన్నా వైద్యం చేయించుకోనిదే నడువలేని స్థితి, ఈస్థితిలో ఆయన అంత బరువున్న రాయిని ఎలా కదిలించి బయటికి వచ్చాడు అన్నది ప్రశ్న!
3) కాపలా ఉండిన రోమా సైనికులు: ఒకవేళ యేసు క్రీస్తు రాయి తీసుకుని వచ్చి ఉంటే రోమా ప్రభుత్వానికి కాపలాదారులు తెలియజేసేవారు. ఆయనను బందించి రోమా ప్రభుత్వానికి అప్పగించేవారు కాని అలాంటిదేమీ జరుగలేదు.
కాబట్టి తేలిన పలితార్థమిదే - స్పృహ కోల్పోయాడు అనేది ఒక కట్టుకథ.
మీ
సహోదరుడు
Brother SURESH
9581881880
No comments:
Post a Comment